యాప్నగరం

సచివాలయం కూల్చివేత: రేవంత్ వేసిన పిటిషన్ మరో బెంచ్‌కు.. సీజేఐ ఆదేశాలు

Supreme Court: పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.

Samayam Telugu 15 Oct 2020, 8:30 pm
తెలంగాణలో పాత సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
supreme court


తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. కేసును జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.