యాప్నగరం

నిజాం రహస్య నిధులు.. కేసీఆర్ సుదీర్ఘ వ్యూహమిదే.. రేవంత్ సంచలన ఆరోపణలు

Telangana Congress: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న తన బంధువు ర‌ఘునంద‌న్ రావును పురావస్తుశాఖకు బదిలీ చేయించుకున్నారని, ఆ తర్వాత తన కార్యాచరణ ప్రారంభించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Samayam Telugu 18 Jul 2020, 6:09 pm
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. సచివాలయ కూల్చివేతపై తాను ఇప్పటికే లేవనెత్తిన అంశాల్లో మరిన్నింటిని ఆయన తెరపైకి తెచ్చారు. సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం ఎన్నో ఏళ్లుగానే వ్యూహ రచన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయంలోని జీ బ్లాక్‌ గురించి పలుమార్లు సీఎం వ్యతిరేకంగా మాట్లాడిన తాలూకు వీడియోలను రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. జూమ్ యాప్ ద్వారా రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
revanth reddy


ఆపరేషన్ జీ బ్లాక్‌కు సంబంధించి చాలా ప్రణాళికా బద్దంగా సీఎం ముందుకు వెళ్లారని ఆరోపించారు. మాయమాటలతో హెరిటేజ్ బిల్లును పాస్ చేయించుకొని, ఆ తర్వాత అస‌లు ప‌ని మొద‌లు పెట్టార‌ని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న తన బంధువు ర‌ఘునంద‌న్ రావును పురావస్తుశాఖకు బదిలీ చేయించుకున్నారని, ఆ తర్వాత తన కార్యాచరణ ప్రారంభించారని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మార్పు జరిగిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారాలతో సచివాలయం కూల్చివేతకు సంబంధించి మరిన్ని అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు.

కూల్చివేత సమయంలో స‌చివాల‌యం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర నిషేధం విధించి అంత ర‌హ‌స్యంగా కూల్చివేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న మరోసారి ప్రశ్నించారు. యాదిగిరిగుట్ట నిర్మాణంలో లేని రహస్యం, సెక్రటేరియట్ విషయంలో ఎందుకని ప్రశ్నించారు. పురావస్తుశాఖ అధికారులు అనుమతి కోరినా ఇవ్వకుండా వారి సమక్షంలో కూల్చివేతలు జరగకుండా చాలా రహస్యంగా పనులు చేపట్టారని తీవ్రంగా విమర్శించారు.

Must Read:undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.