యాప్నగరం

KCR కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. అలా చేయకుంటే రంగంలోకి.. అంటూ హెచ్చరిక

Telangana Congress: ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుంది’’ అని రేవంత్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

Samayam Telugu 10 Jul 2021, 4:26 pm
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్టాఫ్ నర్సుల గురించి కూడా పట్టించుకోవాలని లేఖలో కోరారు. ‘‘కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లని మీరే పొగిడారు. ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1,640 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రగతి భవన్‌కు వస్తే ఐదు నిమిషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? ప్రగతి భవన్.. ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా?’’
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Revanth Reddy KCR


‘‘2018లో ఎంపికైన ఏఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదు. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్ "వన్స్ మోర్" లాగా ఉంది. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటి? ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయండి. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలి.

ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుంది’’ అని రేవంత్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.