యాప్నగరం

వర్మకు షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. ‘పవర్‌స్టార్’ ఎఫెక్ట్!

Power Star సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టిన రాంగోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. ఆ సినిమా పోస్టర్లకు సంబంధించి రూ.88 వేలు జరిమానా విధించింది.

Samayam Telugu 30 Jul 2020, 7:49 am
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ అధికారులు వరుసగా షాకులిచ్చారు. ‘పవర్‌స్టార్’ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అతికించినందుకు గానూ రూ.88 వేలు జరిమానా విధించారు. పవర్‌స్టార్ పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్ టీం రూ. 88 వేలు జరిమానా విధిస్తూ ఈ-చలానా జారీ చేసింది.
Samayam Telugu RGV


ఇటీవల ‘పవర్‌ స్టార్’ సినిమాకు సంబంధించిన పోస్టును ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ విషయమై ఓ నెటిజన్ సీఈసీ-ఈవీడీఎంకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం జూబ్లీహిల్స్ ప్రాంతంలో అంటించిన రెండు పోస్టర్లకు రూ.4 వేలు ఫైన్ విధించారు. అనుమతులు తీసుకోకుండా అదే ప్రాంతంలో 30కిపైగా పోస్టర్లు అంటించడంతో.. రూ.88 వేలు చలానా విధించారు.

ఆర్జీవీ తీసిన పవర్‌ స్టార్ సినిమా ఈ నెల 25న ఆన్‌లైన్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 37 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌‌లో విడుదల చేశారు. ఈ సినిమాకు పోటీగా పవన్ ఫ్యాన్స్ పరాన్నజీవి మూవీని రిలీజ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.