యాప్నగరం

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..

Mancherial జిల్లా ఇందారం గ్రామం మీదుగా 15 మంది కూలీలు డీసీఎంలో పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాగజ్ నగర్‌కు కర్రలోడుతో వెళ్తున్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో క్లీనర్‌తో సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

Samayam Telugu 14 Dec 2019, 12:45 pm
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారీ లోడుతో వెళ్తున్న లారీ-కూలీలతో నిండి ఉన్న డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, 15 మంది గాయపడ్డారు. కలప లోడుతో నిండి ఉన్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టినట్లుగా సాక్షులు తెలిపారు.
Samayam Telugu Telangana Accident2

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం గ్రామం మీదుగా 15 మంది కూలీలు డీసీఎంలో పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాగజ్ నగర్‌కు కర్రలోడుతో వెళ్తున్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో క్లీనర్‌తో సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

Don't Miss: ఆ పని చేస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతా.. :పరిపూర్ణానంద

డీసీఎంలో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృత దేహాలను పోస్టుమార్టం కోసం అదే ఆస్పత్రికి తరలించారు. కూలీల్లో కొంత మంది కర్నూలు జిల్లా అనంతపూర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. కూలీ పని కోసం బెల్లంపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఆ ఇద్దరు అధికారుల్ని జైలుకు పంపితే.. అంతా దారికొస్తారు :హైకోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.