యాప్నగరం

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Munagala: మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు సమీపాన వాంతులు అవుతున్నాయని కుటుంబం మొత్తం కారు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. అప్పుడే వెనకాల నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టింది.

Samayam Telugu 24 Jul 2020, 7:42 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Accident in suryapet
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణం చేస్తూ రోడ్డు పక్కన కారు ఆపి సేద తీరుతున్న కుటుంబాన్ని మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరణించిన వారిని వడుగు నాగమల్లేశ్వరరావు (40), అతని భార్య మామూలమ్మ (34) కుమార్తె దుర్గ (12) గా పోలీసులు గుర్తించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కృత్తివెలు మండలం ఇంటేరు గ్రామానికి చెందిన కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్‌‌లో ఉంటున్న నాగమల్లేశ్వరరావు కుటుంబం కారు మాట్లాడుకొని విజయవాడ వెళ్లి మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు. మధ్యలో మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు సమీపాన వాంతులు అవుతున్నాయని కుటుంబం మొత్తం కారు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. డ్రైవర్ ఒక్కరే కారులో ఉన్నారు. అప్పుడే వెనకాల నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండబాబుకు గాయాలు అవడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుర్ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.