యాప్నగరం

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

Rangareddy: ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 9 Oct 2020, 8:53 am
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నార్సింగి బ్రిడ్జి కింద రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu రోడ్డు ప్రమాదం
Road accident


చనిపోయిన ఇద్దరిని సూర్యాపేటకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.