యాప్నగరం

డిప్యూటీ స్పీకర్ ఇంట్లో దొంగతనానికి యత్నించి, చివరికి..

శుక్రవారం రాత్రి ఐదుగురు దుండగులు ఉపసభాపతి ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. ప్రహరీదాటి లోనికి ప్రవేశించి, ఇంటి కిటికీకి ఉన్న గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. గమనించిన భద్రతా సిబ్బంది ఐదుగురు దొంగలను బంధించి పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 7 Dec 2019, 11:03 am
తెలంగాణ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు ఇంట్లో దొంగలు విజృంభించారు. శుక్రవారం రాత్రి కొందరు దుండగులు ఉపసభాపతి ఇంటిపై దండెత్తేందుకు ప్రయత్నించారు. ప్రహరీదాటి లోనికి ప్రవేశించి, ఇంటి కిటికీకి ఉన్న గ్రిల్స్ తొలగించే ప్రయత్నం చేశారు. ఈలోపు గమనించిన భద్రతా సిబ్బంది ఐదుగురు దొంగలను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ నిందితుల్లో ఒకరు పద్మారావు ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారు ఎవరనే విషయం తేలాల్సి ఉంది.
Samayam Telugu padma rao


Also Read: ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు అత్యవసర విచారణ.. కీలక ఆదేశాలు

అయితే, డిప్యూటీ స్పీకర్ ఇంటికి 24 గంటల పాటు భద్రతా ఉండేలా ప్రభుత్వం నియమించిన సిబ్బంది కాపలా కాస్తుంటారు. ఈ నేపథ్యంలో దొంగలు లోనికి ఎలా ప్రవేశించారనే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాక, నిందితుల్లో ఒకరు పద్మారావు ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి, అతనికి ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించే మార్గాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇతనే మిగతా వారికి నేతృత్వం వహించినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: రేప్ చేసి కాల్చేయడం మానవహక్కుల ఉల్లంఘన కాదా? ఎన్‌హెచ్ఆర్సీకి దిశ పేరెంట్స్ సూటి ప్రశ్న

డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ టీఆర్ఎస్ తొలిసారి అధికారం చేపట్టాక మంత్రి బాధ్యతలను కూడా నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఆ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన ఎక్సైజ్, క్రీడలఖాఖ మంత్రిగా పని చేశారు. గతేడాది డిసెంబరులో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక పద్మారావును డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది.

Also Read: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. స్వీట్లు పంచి యూపీ పోలీసుల సంబరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.