యాప్నగరం

తల్లీ క్షమించు.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్తూ దొంగ భక్తుడు, సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

Abids: భక్తుడిగా ఆలయంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎవరూ లేనిది గమనించి అమ్మవారి కిరీటాన్నీ ఎత్తుకెళ్లాడు. అంతకుముందు చేస్తున్న తప్పునకు ప్రాయాశ్చిత్తంగా దుర్గా మాతను అతడు వేడుకున్న తీరు నవ్వులు పూయిస్తోంది.

Samayam Telugu 21 Nov 2019, 6:31 pm
న్‌ఫౌండ్రీలోని దుర్గా భవానీ ఆలయంలోకి భక్తుడి రూపంలో వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. అంతకుముందు చేస్తున్న తప్పునకు ప్రాయాశ్చిత్తంగా దుర్గా మాతను అతడు వేడుకున్న తీరు నవ్వులు పూయిస్తోంది. చోరీ చేయడానికి ముందు అమ్మవారి విగ్రహం ముందు ప్రదక్షిణలు చేసి.. ‘తల్లీ.. క్షమించు’ అన్నట్లుగా దుర్గా మాత పాదాలకు నమస్కరించాడు. ఆ దృశ్యాలన్నీ ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆలయంలో ఎవరూ లేనిది గమనించిన ఆ ప్రబుద్ధుడు కిరీటాన్నీ చోరీ చేసి.. ఎవరూ గుర్తు పట్టకుండా షర్టు లోపల దాచుకొని బైక్‌పై వెళ్లిపోయాడు.
Samayam Telugu అబిడ్స్ దొంగతనం వీడియో


అబిడ్స్‌లోని దుర్గా భవానీ ఆలయంలో బుధవారం (నవంబర్ 20) సాయంత్రం 6.20 గంటలకు ఈ చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారిని మొక్కుతున్నట్లుగా నటించి, అమ్మవారి తలపై ఉన్న వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన భక్తులు, పూజారి అమ్మవారి తలపై కిరీటం లేకపోవడాన్ని గుర్తించి షాక్ తిన్నారు. దొంగతనం జరిగి ఉంటుందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Don't Miss: ప్రమాదంలో శ్రీశైలం డ్యాం.. మరమ్మతు చేయకపోతే పెను విషాదమే

పూజారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకొని పరిశీలించారు. కిరీటం రూ.20 వేల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీటీవి కెమెరాలను పరిశీలించి చోరీ జరిగిన విధానాన్ని గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నారు. అమ్మవారి కిరీటం చోరీ సందర్భంగా నిందితుడి చేష్టలను వీడియోలో గమనించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.