యాప్నగరం

పొలంలో భారీ ఆడ కొండ చిలువ.. బరువు 20 కేజీలు

కొండచిలువ ఉన్న సమాచారం అందుకున్న పోలీసులు సాగర్ స్నేక్స్ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. చాకచక్యంగా పట్టుకొని దానిని తీసుకెళ్లారు. అడవుల్లో కొండచిలువను వదిలివేస్తామన్నారు.

Samayam Telugu 8 Oct 2020, 12:10 pm
ఇటీవల కాలంలో పలు ప్రాంతల్లో అడవి జంతువుల సంచారం ఎక్కువయ్యింది. ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాలో పలు సార్లు ఎలుగుబంటి కూడా సంచరించింది. తాజాగా వనపర్తి జిల్లాలో భారీ కొండ చిలువ భయాందోళనకు గురి చేసింది. జిల్లాలోని కొత్తకోట మండలం ' పాలెం గ్రామంలోని ఒక వ్యవసాయ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో భారీ కొండచిలువ కనిపించింది. కొండ చిలువను చూసి భయపడిపోయిన గ్రామస్థులు కొత్తకోట మండల తహశీల్దార్ రమేష్ రెడ్డి కి సమాచారం తెలిపారు.
Samayam Telugu పొలంలో కొండచిలువ


Read More: తెలంగాణలో కరోనా కలకలం.. 1200దాటిన మరణాలు

ఇంతలో ఈ విషయం సాగర్ స్నేక్ సొసైటీ కృష్ణ సాగర్ టీమ్ సభ్యులు తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు. పొలాల్లో దాగి ఉన్న భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది అరుదైన రకం కొండచిలువ అని దీనిని రాక్ పైథాన్ అని అంటారని టీమ్ సభ్యులు తెలిపారు. దీని వయసు 12 సంవర్సరాములు ఉండవచ్చని అంచనా వేశారు. దాదాపు 20 కేజీల బరువు కలిగిన ఆడ కొండచిలువ అని దీనిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తామన్నారు. ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే చంప వద్దని వన్యప్రాణులను కాపాడాలని కృష్ణ సాగర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.