యాప్నగరం

బస్ భవన్ వద్ద ఉద్రిక్తత.. అద్దె బస్సుల యజమానుల ఆందోళన

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నా.. తమ పెండింగ్ బిల్లుల్ని మాత్రం చెల్లించడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Samayam Telugu 21 Sep 2020, 11:23 am
బస్ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చారు. దీంతో హైర్ బస్సుల యజమానులంతా బస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఎండి, ట్రాన్స్‌పోర్టు మంత్రి పువ్వాడ అజయ్ తీరును నిరసిస్తూ ఫ్ల కార్డులతో ఆందోళన నిర్వహించారు. బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Samayam Telugu hyderabad bus bhavan
హైదరాబాద్ బస్ భవన్


మార్చి నెల నుండి ఇప్పటివరకు బస్సులు నడుపుకొని బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. మార్చి 22 నుండి ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ లో సుమారు 400 బస్సులను పూర్తిగా నిలుపుదల అయ్యాయన్నారు. జిల్లాలలో కేవలం 25% బస్సులను నడుపుతూ , నడిపిన కాలానికి కూడా బిల్లులు ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ మాత్రం వాళ్ల ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తూ మాకు బిల్లు ఇవ్వకుండా అపుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More: కార్యకర్తను కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... జనం నిలదీయడంతో క్షమాపణలు

పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల ధర్నా నిర్వహించారు. ఆర్టిసి ఎండి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో బస్ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బస్ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.