యాప్నగరం

TSRTC Strike ఎఫెక్ట్.. చక్రాలకు బోల్టులు బిగించకుండానే బస్సులు బయటకు..

ఆర్టీసీ సమ్మె ప్రభావం భద్రతపై పడుతోంది. బస్సుల ఫిట్‌నెస్‌ తనిఖీ చేయకుండానే డిపో నుంచి బస్సులను బయటకు పంపిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. ఆర్టీసీ సిబ్బంది తక్షణమే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Samayam Telugu 6 Oct 2019, 6:29 pm
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. కానీ దసరా పండుగ సీజన్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం కోసం సర్కారు తాత్కాలిక డ్రైవర్లను నియమించింది. వీరి సాయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశం బాగున్నప్పటికీ.. ఆ క్రమంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకు దారి తీస్తోంది.
Samayam Telugu rtc bus1


డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే ముందు కనీస తనిఖీలు చేపట్టకపోవడంతో ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి డిపోకు చెందిన రెండు బస్సులనను చక్రాలకు బోల్టులు సరిగ్గా బిగించకుండానే బయటకు పంపారు. డిపో గేటు వద్ద ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈ విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంత వెంటనే అప్రమత్తమైన అధికారులు వాటిని వెనక్కి పంపించారు.

సమ్మె కారణంగా కొత్తగా విధుల్లో చేరిన తాత్కాలిక డ్రైవర్లకు బస్సుల కండీషన్ పట్ల అవగాహనం ఉండటం లేదు. దీంతో భద్రతకు మారుపేరైనా ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి జనం జంకుతున్నారు. జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read Also: మైనర్ల ర్యాష్ డ్రైవింగ్.. ఎగిరిపడ్డ బైక్.. దంపతుల దుర్మరణం

ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలోనూ సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు చక్రం బోల్టులు ఊడిపోయాయి. ఫిబ్రవరి 8న రాత్రి సంగారెడ్డి నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ బయల్దేరిన బస్సు.. అర్ధరాత్రి లింగపల్లి దగ్గర్లోకి రాగానే బోల్టులు ఊడిపోయాయి. సరైన ఫిట్‌నెస్ తనిఖీలు చేపట్టకుండా బస్సును రోడ్డు మీదకు పంపడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.