యాప్నగరం

బీజేపీ గూటికి విజయశాంతి.. కేంద్ర మంత్రితో కీలక చర్చలు!

Vijayashanti Joins BJP: కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రితో సోమవారం చర్చించారు.

Samayam Telugu 27 Oct 2020, 11:21 pm
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి, బీజేపీ గూటికి చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్నా విజయశాంతి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు ఇంటిపై సోదాలు, ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోలీసుల వివాదంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Samayam Telugu విజయశాంతి (ఫైల్ ఫొటో)


ఈ పరిణామాల నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్‌కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.

నవంబర్ 10వ తేదీ లోపు ముహూర్తం చూసుకుని రాములమ్మ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విజయశాంతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.