యాప్నగరం

రైతు బంధు.. అన్నదాతలకు కీలక అప్డేట్

రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తోన్న అన్నదాతలకు ముఖ్య గమనిక. డిసెంబర్ 27 నుంచి సర్కారు యాసంగి రైతు బంధు నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. ఆ రోజు ఆదివారం కావడంతో మరుసటి రోజు నుంచి నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.

Samayam Telugu 25 Dec 2020, 11:41 am
రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తోన్న తెలంగాణ రైతాంగానికి ముఖ్య అప్‌డేట్. డిసెంబర్ 27 నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్లు.. ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. కానీ 27వ తేదీ ఆదివారం కావడంతో.. సోమవారం నుంచి రైతు బంధు నిధులను అన్నదాతల ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాసంగి సీజన్లో రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య మరో 1.70 లక్షల పెరిగింది.
Samayam Telugu kcr with errabelli
Minister E Dayakar Rao presents a plough to CM KCR at the inauguration of Rythu Vedika


గత సీజన్లో 57.662 లక్షల మంది పట్టాదారులకు ప్రభుత్వం రైతు బంధు పంపిణీ చేయగా.. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన వారిని సైతం తాజాగా రైతు బంధు లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. దీంతో రైతు బంధు అందుకునే వారి సంఖ్య పెరిగింది.

యాసంగి సీజన్లో రూ.7300 కోట్ల నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా.. వ్యవసాయ శాఖ తుది జాబితాను ఇంకా ఖరారు చేయలేదు. రైతు బంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు తెలంగాణ సర్కారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.