గిరిజనుల కుంభమేళా మేడారం మహా జాతర రెండో రోజైన గురువారం (ఫిబ్రవరి 6) అట్టహాసంగా కొనసాగుతోంది. జాతరకు తరలివచ్చిన భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. అరణ్యం జనసంద్రమైంది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరన్ రెడ్డి చిలకలగుట్టను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు మేడారం జాతరలో భక్తులకు కల్పించిన వసతులను మంత్రి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడారు. అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించామని మంత్రి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఈసారి క్యూ లైన్లను పెంచామని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని.. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా దీన్ని జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు.
మరోవైపు.. మేడారం జాతరలో మహత్తర ఘట్టానికి మరికొద్ది గంటల్లో అంకురార్పణ పడనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి సంప్రదాయ పద్ధతిలో మేడారానికి వచ్చి గద్దెలపై కొలువు తీరనుంది. సమ్మక్క తల్లి రాక సందర్భంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపి ఘన స్వాగతం పలుకనున్నారు. ఆ అపురూప క్షణాల కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం వనదేవతలను సందర్శించుకోనున్నారు. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పా్ట్లు చేస్తున్నారు.
Also Read: గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు.. మార్మోగిన అరణ్యం
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు మేడారం జాతరలో భక్తులకు కల్పించిన వసతులను మంత్రి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడారు. అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించామని మంత్రి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఈసారి క్యూ లైన్లను పెంచామని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని.. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా దీన్ని జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు.
మరోవైపు.. మేడారం జాతరలో మహత్తర ఘట్టానికి మరికొద్ది గంటల్లో అంకురార్పణ పడనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి సంప్రదాయ పద్ధతిలో మేడారానికి వచ్చి గద్దెలపై కొలువు తీరనుంది. సమ్మక్క తల్లి రాక సందర్భంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపి ఘన స్వాగతం పలుకనున్నారు. ఆ అపురూప క్షణాల కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం వనదేవతలను సందర్శించుకోనున్నారు. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పా్ట్లు చేస్తున్నారు.
Also Read: గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు.. మార్మోగిన అరణ్యం