యాప్నగరం

హైదరాబాద్‌లో గంధపు చెట్ల దొంగతనం.. నగర నడిబొడ్డులో కలకలం

Hyderabad: ఆదివారం తెల్లవారుజామున గంధం చెట్లను నరికి వేసి వాటిని తరలించినట్లు అధికారులు మరుసటి రోజు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 11 Nov 2020, 7:45 pm
హైదరాబాద్ నగర నడి బొడ్డులో గంధపు చెట్లు దొంగతనానికి గురి కావడం కలకలం రేపుతోంది. నగరంలోని ఇందిరా పార్క్‌లో ఈ ఘటన జరిగింది. పార్కులో ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న గంధం చెట్లు మాయమయ్యాయి. మొత్తం 13 గంధపు చెట్లు నరికి వేసి ఉన్నట్టుగా పోలీసులు తేల్చారు. ఈ సంఘటన ఆదివారం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి గాంధీనగర్ పోలీసులకు ఇందిరా పార్క్ మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Samayam Telugu గంధపు చెట్లు మొదళ్లను కత్తిరించేసి ఎత్తుకుపోయిన దుండగులు
sandalwood trees gets theft


అయితే ఆదివారం తెల్లవారుజామున గంధం చెట్లను నరికి వేసి వాటిని తరలించినట్లు అధికారులు మరుసటి రోజు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా దీని వెనకాల గతంలో పనిచేసిన సిబ్బంది ఉండి ఉండొచ్చని.. లేకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హస్తం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 53 గంధం చెట్లు మాయమయ్యాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.