యాప్నగరం

Telangana Coronavirus Deaths: సంగారెడ్డిలో విషాదం... కరోనాతో మహిళా కౌన్సిలర్ మృతి

గత కొన్నిరోజులుగా ఆమె కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమె ఇవాళ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Samayam Telugu 6 Jul 2020, 2:55 pm
తెలంగాణలో కరోనా వైరస్ జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. రోజరోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూసి జనం భయపడిపోతున్నారు. మరణాల సంఖ్య కూడా కలవరం సృష్టిస్తోంది. తాజాగా సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ కరోనాతో మృతిచెందారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు ఐదు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఛాతీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఈ రోజు మరణించినట్లు జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. ఆమె కొడుకుకు కూడా కరోనా సోకిందని, ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Samayam Telugu కరోనా పేషెంట్లు (ఫైల్ ఫోటో)
corona patients


ఆదివారం తెలంగాణలో 1590 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. 5290 శాంపిల్స్ ప‌రీక్షించారు. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. తాజా కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఏడుగురు క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.