యాప్నగరం

మీటింగ్‌లో ఏడ్చేసిన మహిళా ఎంపీపీ.. ఆ ఎంపీడీవో.!

జడ్పీ మీటింగ్ జరుగుతుండగా ఓ మహిళా ప్రజాప్రతినిధి కంటతడి పెట్టుకున్నారు. ఎంపీడీవో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. ఆయన కారణంగానే తన భర్త చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.

Samayam Telugu 4 Aug 2021, 4:54 pm
అధికార వ్యవస్థ నిర్లక్ష్యం.. మహిళా ప్రజాప్రతినిధులను లెక్కచేయనితనానికి నిదర్శనంగా నిలుస్తోందీ ఘటన. జడ్పీ మీటింగ్‌లో ఓ మహిళా ప్రజాప్రతినిధి బోరున ఏడ్చిన సంఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. ఓ ఎంపీడీవో నిర్వాకం చెప్పుకుని.. అతను పెట్టిన ఇబ్బందుల కారణంగా తన భర్త గుండెపగిలి చనిపోయాడంటూ ఆమె కంటతడి పెట్టడం కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
Samayam Telugu కంటతడి పెట్టుకుంటున్న ఎంపీపీ
mpp sangareddy


సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్‌లో సంగారెడ్డి ఎంపీపీ లావణ్య కన్నీటి పర్యంతమయ్యారు. భర్త పోయిన బాధను వ్యక్తం చేస్తూ అధికారుల ఎదుటే ఏడ్చేశారు. ఎంపీడీవో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె వాపోయారు. ఎంపీడీవో కనీసం సహకరించకుండా ఇబ్బందిపెట్టడంతో ఫోన్ మాట్లాడుతూనే తన భర్త కుప్పకూలిపోయాడని.. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయాడని చెప్పారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సదరు ఎంపీడీవోపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆమెకు సర్దిచెప్పారు. ఎంపీపీ కన్నీరు పెట్టుకున్న వీడియో చూపరులను కలచివేస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.