యాప్నగరం

లాక్‌డౌన్‌లో.. రోజంతా పని చేయనున్న బ్యాంకులు

అత్యవసర సేవల కింద బ్యాంకులు, ఏటీఎంలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంక్ కార్య కలాపాలు కొనసాగనున్నాయి,

Samayam Telugu 12 May 2021, 7:45 am
తెలంగాణలో ఇవాల్టి నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నిత్యావసరాలతో పాటు. అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఆ తరువాత అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని, పూర్తి కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Samayam Telugu రోజంతా పనిచేయనున్న ఎస్బీఐ


అయితే లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం పనిచేయనున్నాయి. అత్యవసర సేవల విభాగంలో ఉన్నందున బ్యాంకులు, ఏటీఎంలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల్లో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200 బ్రాంచిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని హైదరాబాద్‌లోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.