యాప్నగరం

భాగ్యనగరంలో రెండో అతిపెద్ద గణనాథుడిని చూశారా..

Khairatabad గణేషుడి తర్వాత రెండో అతిపెద్ద గణనాథుడు నగరంలోని చైతన్యపురిలో కొలువుదీరాడు. బడా గణేష్‌ను రూపొందించిన శిల్పి రాజేంద్రనే ఈ విగ్రహాన్ని కూడా రూపొందించడం మరో విశేషం

Samayam Telugu 10 Sep 2019, 8:18 pm
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రుల పేరు చెబితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహమే గుర్తుకొస్తుంది. విభిన్న రూపాలో ఆ భారీ రూపం మదిలో మెదులుతుంది. ఖైరతాబాద్ గణేష్‌కు ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఏడాది ఈ వినాయకుడి దర్శనానికి భక్తులు మరింత పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. హైదరాబాద్ మెట్రోతో భక్తుల రాకపోకలు మరింత సులభమయ్యాయి.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహాల తరహాలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ కొన్నేళ్లుగా భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. భాగ్య నగరంలో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత రెండో అతిపెద్ద విగ్రహం ఏది? అందరిలో ఆసక్తి రేపుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో..

Don't Miss: బడా గణేష్ ఎఫెక్ట్.. మెట్రో రైలు రికార్డులు బ్రేక్

హైదరాబాద్‌లోని చైతన్యపురిలో భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. 36 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద గణపతిగా రికార్డులకెక్కాడు. శ్రీమణికంఠ అయ్యప్ప భక్తసమాజం ఆధ్వర్యంలో కమలానగర్‌లో ఈ భారీ గణపయ్యను ఏర్పాటు చేశారు.

Also Read: కేసీఆర్ బడ్జెట్‌పై విమర్శల వర్షం..

ఖైరతాబాద్ వినాయకుడి శిల్పి రాజేంద్రనే ఈ చైతన్యపురి గణనాథుడిని కూడా రూపొందించడం మరో విశేషం. ఈ మండపంలో గోకుల గణపతిని తీర్చిదిద్దారు. నగరంలో రెండో అతిపెద్ద గణపతిగా గుర్తింపు పొందడంతో ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిత్య పూజలు అందుకుంటున్న ఈ భారీ గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.