యాప్నగరం

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం.. మూడునెలలు మరింత అప్రమత్తం

రానున్న మూడు రోజులు శీతాకాలం కావడంతో కరోనాకు తోడు ఇతర సీజనల్ వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది.

Samayam Telugu 28 Oct 2020, 8:21 am
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ రెండో దశ విజ‌ృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. వచ్చే మూడునెలలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో అమెరికా, ఐరోపా దేశాల్లో రెండో దశలో కొవిడ్‌ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల పాటు ప్రజలు అప్రమత్తతతో వైరస్‌ నిరోధక నియంత్రణలు పాటించాలన్నారు.
Samayam Telugu కరోనా మళ్లీ విజృంభణ
corona cases in Telangana


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌ నియంత్రణ చర్యలు, ప్రజల సహకారం వల్ల గత నెల రోజులుగా కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో వరుసగా దీపావళి, క్రిస్‌మస్‌, సంక్రాంతి పండుగల వస్తున్నాయి. దీంతో ప్రజలు సందడి నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో కొవిడ్‌ సహా ఇతర కాలానుగుణ వ్యాధులు విరుచుకుపడే ముప్పు ఉందన్న ఆందోళన సర్కారులో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష నిర్వహించి, భవిష్యత్‌ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు.

Read More: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలిసారిగా..

కరోనా రెండోదశను నివారించడంపై ఇప్పట్నుంచే దృష్టిపెట్టాలన్నారు. వచ్చే మూణ్నెళ్లు అత్యంత కీలకం. గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలను భాగస్వాములుగా చేసి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం తదితర ఏ మాత్రం లక్షణాలు కనిపించినా.. వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించాలన్నారు. సెలవు, పండుగ రోజుల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గుతోందన్నారు అధికారులు. ఇక నుంచి అన్ని రోజుల్లోనూ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వైరస్‌ బాధితునితో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులనూ గుర్తించి వారికీ వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే నిర్ధారణ పరీక్షల కేంద్రాల సంఖ్యా పెంచాలన్నారు. హోం క్వారంటైన్‌కు అవకాశం లేని వాళ్లు సమీపంలోని ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలించి చికిత్స అందించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.