కుటుంబ సభ్యులు వారించినా పేదలకు వైద్యం.. కరోనాకు బలైన హైదరాబాద్ డాక్టర్
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో హాస్పిటల్కు వెళ్లొద్దని కుటుంబ సభ్యులు వారించినప్పటికీ లెక్క చేయకుండా పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ కోవిడ్కు బలయ్యారు.
Samayam Telugu 5 Jul 2020, 8:31 am
కరోనా వైరస్ మహమ్మారి హైదరాబాద్ నగరానికి చెందిన మరో డాక్టర్ను బలి తీసుకుంది. సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సీతాఫల్మండీలో క్లినిక్ నిర్వహించిన ఆయన.. 1974లో శ్రీదేవి నర్సింగ్ హోం ఏర్పాటు చేసి.. పేదల వైద్యుడిగా పేరొందారు. ఏళ్ల క్రితం 15 బెడ్లతో క్లినిక్ ప్రారంభించిన ఆయన.. దాన్ని 150 బెడ్ల స్థాయికి పెంచారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను ఆయన స్వస్థలం. సీతాఫల్మండిలో మొదట క్లినిక్ నిర్వహించారు. ఆయనకు భార్య పూర్ణిమ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీతాఫల్మండిలోని వీరమాచనేని పగడయ్య ఉన్నత పాఠశాల వ్యవస్థాపకుల్లో కేవీఆర్ ప్రసాద్ ఒకరు.
హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత పెరగడంతో డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్కు వెళ్లొద్దని ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ ఆయన మాత్రం పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలను కొనసాగించారు. జూన్ 10న గొంతు నొప్పి, జ్వరం వచ్చే వరకు రోజుకు వంద మంది పేషెంట్లను ఆయన పరీక్షించారు.
టెస్టులు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. మూడు వారాలపాటు వైరస్తో పోరాడిన ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయారు. ‘‘కోవిడ్తో పోరాడుతున్న ప్రస్తుత తరానికి మా నాన్న ఆదర్శం. తన భద్రత సంగతి పట్టించుకోకుండా పేషెంట్లకు ప్రాధాన్యం ఇచ్చి వైరస్కు బలయ్యారు. ఆయన నిజమైన యోధుడు. కోవిడ్తో పోరాడుతున్న యోధులందరికీ సెల్యూట్. వైద్య వృత్తిలో ఉన్న ఆయన లాంటి వారు నిబద్ధతను, తమ అభిరుచిని చాటుకుంటున్నారు’’ అని డాక్టర్ ప్రసాద్ పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు.
హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత పెరగడంతో డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్కు వెళ్లొద్దని ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ ఆయన మాత్రం పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలను కొనసాగించారు. జూన్ 10న గొంతు నొప్పి, జ్వరం వచ్చే వరకు రోజుకు వంద మంది పేషెంట్లను ఆయన పరీక్షించారు.
టెస్టులు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. మూడు వారాలపాటు వైరస్తో పోరాడిన ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయారు. ‘‘కోవిడ్తో పోరాడుతున్న ప్రస్తుత తరానికి మా నాన్న ఆదర్శం. తన భద్రత సంగతి పట్టించుకోకుండా పేషెంట్లకు ప్రాధాన్యం ఇచ్చి వైరస్కు బలయ్యారు. ఆయన నిజమైన యోధుడు. కోవిడ్తో పోరాడుతున్న యోధులందరికీ సెల్యూట్. వైద్య వృత్తిలో ఉన్న ఆయన లాంటి వారు నిబద్ధతను, తమ అభిరుచిని చాటుకుంటున్నారు’’ అని డాక్టర్ ప్రసాద్ పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు.