యాప్నగరం

కాంగ్రెస్‌కు మరో షాక్... సీనియర్ నేత రాజీనామా

విజయశాంతి బీజేపీలో చేరిన రోజే.. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.

Samayam Telugu 7 Dec 2020, 3:25 pm
కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా హస్తం పార్టీకి మరో సీనియర్‌ నేత హ్యాండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్‌ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్


Read More: NO LRS.. NO TRS.. ఖమ్మం పర్యటనలో కేటీఆర్‌కు షాక్

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణతో పాటు త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ విజయశాంతితో ప్రచారం చేయించాలనే వ్యూహంలో కమలనాధులు ఉన్నారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో వెళ్లి అమిత్‌షాను కలిశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.