యాప్నగరం

గ్రేటర్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్

మాజీ ఎమ్మెల్యేతో పాటు.. మాజీ మేయర్ కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సమాచారం.

Samayam Telugu 18 Nov 2020, 8:03 am
గ్రేటర్ ఎన్నికల వేళ పలు పార్టీలకు చెందిన వేరే పార్టీల్లోకి వలసలుపోతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలకు ముందే మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, నియోజక వర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ బీజేపీలోకి చేరనున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న భిక్షపతి యాదవ్ బీజేపీలో చేరాలని నిర్ణయించారు.
Samayam Telugu కాంగ్రెస్‌కు మరో షాక్
bjp joinings


Read More: Pawan Kalyan: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

దీంతో బీజేపీ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహా రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీలో చేరిపోయారు. మరోవైపు ఇవాళ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు,మాజీ కార్పొరేటర్లు ఇప్పటికే కమలం తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.