యాప్నగరం

షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య.. సోదరి ఇంటికి వెళ్లి..

షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ భూ వివాదం కేసులో సుజాతను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఆమె భర్త అజయ్ కుమార్‌ను కూడా విచారించింది.

Samayam Telugu 17 Jun 2020, 11:18 am
షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అజయ్ కుమార్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ భూవివాదం, ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఇటీవలే పోలీసులు సుజాతను అరెస్ట్ చేశారు. గతంలో ఏసీబీ అధికారులు సుజాత భర్తను కూడా విచారించారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న అజయ్ కుమార్ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లారు. అక్కడే ఐదు అంతస్థుల భవనం మీది నుంచి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Samayam Telugu నమూనా చిత్రం
suicide


అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నం.14 లోని రూ. 40 కోట్ల విలువైన భూమి కేసులో లంచం తీసుకున్నట్లు తేలడం, ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో.. షేక్‌పేట తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు ఇటీవల జూన్ 8న అరెస్ట్ చేశారు. అబ్దుల్ సయ్యద్ ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరపరచగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

Read Also: బంజారాహిల్స్ భూవివాదం.. ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.