యాప్నగరం

బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ భవనం పైనుంచి పడి యువతి మృతి

Shamshabad మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్లో చాటింగ్ చేస్తూ ఓ యువతి భవనం పైనుంచి పడి దుర్మరణం పాలైంది. ఎయిర్‌పోర్టులో పనిచేస్తూ ఆమె స్థానికంగా నివాసం ఉంటోంది.

Samayam Telugu 14 Jan 2020, 9:29 pm
మూడంతస్తుల భవనం పైనుంచి పడి ఓ యువతి దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ మండల కేంద్రంలో జరిగింది. బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ భవంతి పైనుంచి కింద పడినట్లు తెలుస్తోంది. మంగళవారం (జనవరి 14) సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా ముధోల్‌ టౌన్‌ విద్యాగిరినగర్‌కు చెందిన సిమ్రాన్‌ (22)గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu airport


ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. కర్ణాటకు చెందిన యువతి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమర్ సర్వీసెస్‌లో విధులు నిర్వహిస్తూ స్థానికంగా నివాసం ఉంటోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను అద్దెకు ఉంటున్న భవంతి మిద్దె పైకి చేరుకొని ఫోన్లో మాట్లాడుతోంది. ఆ తర్వాత కాసేపటికే భవంతి పైనుంచి కిందపడిపోయింది.

Must Read: ఫేస్‌బుక్ పరిచయం.. వివాహితను ట్రాప్ చేసి..

తలకు తీవ్రమైన గాయం కావడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవంతి పైనుంచి యువతి ఒక్కసారిగా కిందపడి మృతి చెందడాన్ని ప్రత్యక్షంగా చూసిన కొంత మంది భయాందోళలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. ఎన్నికల తనిఖీల్లో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.