యాప్నగరం

Vizag Gas Leak: ఇదెంత భయంకరమైన ఏడాది.. విశాఖ దుర్ఘటనపై కేటీఆర్ స్పందన

LG Polymers | విశాఖలోని ఎల్‌జీ పాలిమర్ కంపెనీల నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్న ఆయన.. ఈ ఏడాది ఎంత భయకరమైందంటూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 7 May 2020, 2:02 pm
విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ గ్యాస్ లీక్ వీడియోలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి వారికి మంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామన్నారు. ఇది ఎంత దారుణమై ఏడాదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న విషయాన్ని మంత్రి ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించారు.
Samayam Telugu కేటీఆర్


విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కేటీఆర్ ట్వీట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. పఠాన్‌చెరు సమీపంలోని పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించే ఆలోచన ఉందా అని కొందరు నెటిజన్లు మంత్రిని అడిగారు. తెలంగాణలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ లాంటి సంస్థలను గుర్తించాలని.. అవి నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని కోరుతున్నారు.
విశాఖపట్నంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఉన్న ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో లీకైన రసాయన వాయువు గాలి ద్వారా పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో చాలా మంది ప్రజలు కళ్ల మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరైతే రోడ్ల మీదకు వచ్చి పడిపోయారు. పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు వదిలాయి.. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోగా.. వందలాది మంది హాస్పిటల్ పాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.