యాప్నగరం

వరంగల్‌లో విషాదం... రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

పోలీస్ వాహనంలో వెళ్తుండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో ఆయన వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Samayam Telugu 3 May 2020, 12:30 pm
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎస్ఐ ప్రాణం బలితీసుకుంది. వరంగల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీకి చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కర్ణుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జనగామ జిల్లా పెంబర్తి శివారు వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డిపార్ట్‌మెంట్‌ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నట్టుగా తెలిసింది. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Samayam Telugu రోడ్డు ప్రమాదం


వరంగల్ నుండి హైదరాబాదు వెళ్తుండగా పెంబర్తి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఎస్ఐ మరణవార్తను ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు.వరంగల్ జిల్లాలో కర్ణుడు ఆర్ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. ఎస్ఐ అకాల మరణంతో ఆయన కుటుంబంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు పోలీసులు కూడా జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.