యాప్నగరం

టీవీ రిమోట్ కోసం అక్కాచెల్లెళ్ల దెబ్బలాట.. ఒకరు మృతి

Pet Basheerabad: జనగామలో ప్రైవేటు హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుకుంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. చెల్లెలు మాత్రం ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వెళ్తోంది.

Samayam Telugu 14 Jan 2020, 9:29 am
అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు లేదా సోదర సోదరీమణులు ఉన్న ఇంట్లో టీవీ రిమోట్ కోసం దెబ్బలాడుకోవం షరా మామూలే. దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి సరదా సన్నివేశాలు కనిపిస్తుంటాయి. కానీ, ఇలాంటి గొడవ తీవ్రమై ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టీవీ ఛానెల్ చూసే విషయంలో అక్కా చెల్లెళ్లు గొడవ పడడం ఈ విషాదానికి దారి తీసింది. రిమోట్ కోసం వారిద్దరూ కొట్లాడుకున్న అనంతరం అవమానంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Samayam Telugu tv.


Also Read: సీఎం కేసీఆర్, జగన్ భేటీ.. కీలక నిర్ణయాలివే

ఆ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీలో ఉండే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి 19 ఏళ్లు. జనగామలో ప్రైవేటు హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుకుంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. చెల్లెలు మాత్రం ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం టీవీ చూసే విషయంలో చెల్లెతో అక్క తగాదాకు దిగింది. ఈ తగాదాలో చెల్లెలే నెగ్గడంతో అక్క అవమానానికి గురయింది. దాన్ని భరించలేకపోయింది.

Also Read: Bhainsa ఎఫెక్ట్: ప్రభుత్వ ఆదేశాలతో.. 4 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్

దీంతో అవమానానికి గురైన యువతి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. అదే సమయంలో బయటకు వెళ్లిన తండ్రి ఇంట్లోకి వచ్చి చూడగా పెద్ద కూతురు ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అమ్మాయి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad Metro తరహాలో నగరంలో మరో అధునాత వ్యవస్థ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.