యాప్నగరం

భారీ అవినీతితో పట్టుబడ్డ పోలీస్.. అరెస్టు చేసిన ఏసీబీ

ACB అధికారులు సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహ రెడ్డిని అరెస్టు చేశారు. రెండు రోజులుగా ఆయనకు చెందిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

Samayam Telugu 19 Dec 2019, 9:39 pm
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో రెండు రోజుల పాటు సిద్దిపేట అదనపు ఎస్పీ నర్సింహ రెడ్డి ఇల్లు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సిద్దిపేటతోపాటు, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
Samayam Telugu Capture


అయితే, ఈ సోదాల్లో నర్సింహ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమే అని తేలింది. అధికారులు జరిపిన దాడుల్లో కిలోన్నర బంగారం, రూ5.3 లక్షల నగదు, రూ.6 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండలో విల్లాతో పాటు, శంకర్ పల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్ నగర్‌లలో 20 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతనికి చెందిన రెండు కార్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అడిషనల్ ఎస్పీ నర్సింహ రెడ్డి 5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతణ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. అయితే, తనపై కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగాయని నర్సింహరెడ్డి వివరణ ఇచ్చారు. తాను చాలా నిజాయతీపరుడినని సమర్థించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.