యాప్నగరం

వాహనం ఢీ.. కూలిన హరితహారం మొక్క.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం కంటే భారీ జరిమానా!

తెలంగాణలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. కొన్ని చోట్ల మేకలు మొక్కలను తినేయడం లాంటి ఘటనలు చోటు చేసుకోగా.. వాటి యజమానులకు సంబంధిత అధికారులు జరిమానా విధించారు. ఉద్దేశపూర్వకంగా మొక్కలను నరికేసిన వారికి సైతం జరిమానాలు, శిక్షలు విధించారు.

Samayam Telugu 9 Dec 2019, 1:05 pm
తెలంగాణలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. కొన్ని చోట్ల మేకలు మొక్కలను తినేయడం లాంటి ఘటనలు చోటు చేసుకోగా.. వాటి యజమానులకు సంబంధిత అధికారులు జరిమానా విధించారు. ఉద్దేశపూర్వకంగా మొక్కలను నరికేసిన వారికి సైతం జరిమానాలు, శిక్షలు విధించారు.
Samayam Telugu siddipet municipality fines rs 9500 to vehicle driver for destroying haritha haram plant
వాహనం ఢీ.. కూలిన హరితహారం మొక్క.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం కంటే భారీ జరిమానా!


హరిత సిద్ధిపేట ధ్యేయం

హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు ప్రతి నెలా లక్షలాది రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని.. వాటికి ఎవరు హాని తలపెట్టినా జరిమానా చెల్లించాల్సిందేనని హరితహారం అధికారి హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటను హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.

కృతజ్ఞతలు తెలిపిన అధికారి

హరితహారం మొక్కల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్ధిపేట పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈ తదితరులకు హరితహారం అధికారి సామల్ల ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

బయోడైవర్సిటీ ప్రమాదంలో..

హరితహారంలో మొక్కల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఘటన చాటి చెప్పింది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం జరిగిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో.. ఓ మహిళ మరణానికి కారణమైన వాహనదారుడికి పోలీసులు విధించిన జరిమానా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంతో ఈ జరిమానా విధించారు. మరి మొక్కల పెంపకానికే కాదు.. మనిషి ప్రాణాలకు విలువనిచ్చేలా చట్టాలను సవరిస్తే బాగుంటుందేమో.

అప్పటికప్పుడు కట్టమంటే ఎలా?

పొరబాటున మొక్కను ఢీకొట్టినందుకు రూ.9500 ఫెనాల్టీ వేయడం సరైందే కావొచ్చు. కానీ అప్పటికప్పుడు అంత మొత్తం తీసుకొచ్చి కట్టాలంటే.. ఓ పేద కుటుంబానికి సాధ్యం అవుతుందా? కాదా? అనే విషయాన్ని కూడా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని సమాచారం. డబ్బులు కట్టాకే వాహనం తాళాలు, పేపర్లు ఇచ్చారని కూడా ‘సమయం’ వద్ద సమాచారం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.