యాప్నగరం

మొక్కే కదాని పీకేశాడు.. బాలయ్య బుక్కయ్యాడు!

మొక్కే కదాని పీకేసిన వ్యక్తికి మున్సిపాలిటీ అధికారులు గుబ గుయ్‌మనేలా ఫైన్ విధించారు. 30 మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను అప్పగించారు. ఈ ఘటన సిద్ధిపేటలో చోటు చేసుకుంది.

Samayam Telugu 2 Oct 2019, 1:14 pm
ఇంద్ర సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా.. అన్న చిరంజీవి డైలాగ్ గుర్తుందా? మనం మర్చిపోయినా తెలంగాణ అధికారులు మాత్రం మర్చిపోయినట్టు లేదు. ఇంతకూ ఏమైందంటే.. హరితహారంలో భాగంగా సిద్దిపేట మిలన్ గార్డెన్ రోడ్డులో బృందావన్ కాలనీ ఎదురుగా మొక్కలను నాటారు. వీటిని తెలుజూరు బాలయ్య అనే వ్యక్తి పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Samayam Telugu siddipet.


మొక్కలను ధ్వంసం చేసిన బాలయ్యకు రూ.30,000 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అంతేకాదు మొక్కలను ధ్వంసం చేసిన బాలయ్యతో 30 మొక్కలు నాటించి, ఏడాది వరకు ఆ మొక్కల సంరక్షణ బాధ్యత అతడికే అప్పగిస్తామని చెప్పారు.

Read Also: సైరా సినిమాకెళ్లిన ఆరుగురు ఎస్సైలపై వేటు

మేకలు మొక్కలు తింటేనే పంచాయతీ, మున్సిపల్ అధికారులు ఊరుకోవడం లేదు. మీ మేకలు మొక్కల్ని తిన్నాయని వాటి యజమానుల నుంచి ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తున్నారు. అలాంటి బాధ్యయుతమైన పౌరుడై ఉండి హరితహరం మొక్కలను పాడు చేస్తుంటే.. అధికారులు చూస్తూ ఊరుకుంటారా? తగిన శాస్తి చేశారు కదూ. జై హరిత తెలంగాణ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.