యాప్నగరం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిమీ ఉగ్రవాది అరెస్టు.. నగరంలో అలర్ట్

Hyderabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు సిమీ ఉగ్రవాది కెమికల్ అలీని అరెస్టు చేశారు. నగరంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఉగ్రవాది 2013 పేలుళ్లలో నిందితుడు.

Samayam Telugu 12 Oct 2019, 11:09 pm
హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిమీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కెమికల్ అలీ అలియాస్ అజహరుద్దీన్ వల వేసి పట్టుకున్నారు. అతడు కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లారు.
Samayam Telugu terrorist


శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాది అరెస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ అలీ అలియాస్ అజహరుద్దీన్ 2013లో పాట్నా, బోధ్‌గయలో జరిగిన బాంబు పేలుడులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Don't Miss: 52 ఏళ్ల వయసులో కవలలకు జన్మ.. కొడుకు మరణించడంతో మళ్లీ గర్భం దాల్చిన మహిళ

రాయ్‌పూర్‌కు చెందిన అజరుద్దీన్ 2013 పేలుళ్ల అనంతరం సౌదీ అరేబియాకు పారిపోయాడు. అక్కడ ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నట్లు సమాచారం. నాటి కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.