యాప్నగరం

సింగరేణిలో లాక్ డౌన్‌కు బదులుగా లేఆఫ్.. ఎందుకిలా..

Singareni: అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లేఆఫ్‌ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

Samayam Telugu 1 Apr 2020, 5:46 pm
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున సింగరేణి తమ కార్మికులకు లేఆఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఏప్రిల్ 1న రెండో షిఫ్టు నుంచి అత్యవసర సేవల సిబ్బంది, ఓపెన్ కాస్ట్ గనులు సహా, కొండాపూర్ గనులు మినహా మిగతా భూగర్భ గనులు మొత్తం మూసివేస్తున్నట్లుగా సింగరేణి గనుల చీఫ్ ఇన్స్‌పెక్టర్ ప్రకటించారు. ఈ లేఆఫ్ ఏప్రిల్ 14 మూడో షిఫ్టు వరకూ అమలులో ఉంటున్నట్లుగా వివరించారు.
Samayam Telugu Singareni
Facebook/Singareni Collieries Company Limited - Sccl,Telangana


Also Read: తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి షాక్!

అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లేఆఫ్‌ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సామాజిక దూరం పాటించలేని పరిస్థితులు లేవని యాజమాన్యం వివరించింది.

Also Read: వరంగల్‌లో ‘కరోనా నాగు పాము’.. కుబుసం విడిచి, గంటల కొద్దీ..

Also Read: నిజామాబాద్‌లో మరో కరోనా పాజిటివ్.. సిబ్బందికి స్థానికుల చుక్కలు

మెషిన్‌ మైనింగ్‌ ఉన్న వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్‌, కొండాపూరం భూగర్భ గనులతో పాటు, అన్ని ఉపరితల గనులను యథావిథిగా పని చేస్తాయని వివరించింది. మూసివేసిన గనుల్లో కూడా అవసరమైన విభాగాలకు చెందిన వారు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పనులు జరుగుతున్న చోట కరోనా కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ లేఆఫ్‌‌ను విధించడం వల్ల పరిశ్రమల చట్టం 1947 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Watch: ముళ్ల కర్రతో అక్కడ కొడితే మాంసం ఎగురుతది.. పోలీసుల హెచ్చరిక.. వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.