యాప్నగరం

వేములవాడలో పారిశుద్ధ్యం ఇంత దారుణమా.. కలెక్టర్ ఆగ్రహం

వేములవాడ రాజరాజేశ్వర ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని పరిశీలించి ఈవోపై మండిపడ్డారు.

Samayam Telugu 1 Feb 2020, 12:39 am
వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యంపై సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనకు మెమో జారీ చేశారు. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. శుక్రవారం (జనవరి 31) ఆలయాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో చెత్త, దుర్గంధాన్ని చూసి ఆగ్రహం చెందారు.
Samayam Telugu collect


కలెక్టర్ తనిఖీలు చేస్తుండగా.. కొత్త మంది స్థానిక నేతలు ఆలయ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆలయ కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేములవాడ ఆలయ పరిసరాలను కలెక్టర్ తనిఖీ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.

Also Read: కరోనా కలవరం.. హైదరాబాద్‌లో పెరుగుతున్న అనుమానిత కేసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.