యాప్నగరం

TSPSC లీకేజీ కేసు.. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఆమె డైరీ నుంచే కొట్టేశారు!

TSPSC Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈకేసులో ఇప్పటికి వరకు 15 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. కీలక ఆధారం లభించింది. కాన్ఫిడెన్షియల్ రూం అడ్మిన్.. శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగిలించినట్లు విచారణలో తెలిసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 28 Mar 2023, 9:15 am

ప్రధానాంశాలు:

  • TSPSC లీకేజీ కేసులో సిట్ దూకుడు
  • 15కు చేరిన నిందితుల అరెస్టులు
  • నిన్న విచారణలో కీలక ఆధారం లభ్యం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TSPSC Paper Leakage Case
టీఎస్‌పీఎస్సీ కేసు
TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిన్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 15కు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తుండగా.. ఒకే మండలం, విభాగంలో పనిచేస్తున్న డాక్యా నాయక్‌ (ఈ కేసులో ఏ 4 నిందితుడు)తో అతనికి పాత పరిచయం ఉంది. తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని డాక్యా నాయక్ తిరుపతయ్యకు చెప్పాడు. దీంతో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్‌ కుమార్‌తో రూ.10 లక్షలకు తిరుపతయ్య బేరం కుదర్చాడు. ముందుగా రూ.5 లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం అతడికి ఇచ్చారు. ఈ వ్యవహారంలో తిరుపతయ్య మీడియేటర్‌గా పని చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు ఈ కేసులో సిట్ అధికారులకు కీలక ఆదారం లభించింది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి, డాక్యా నాయక్‌, రాజేందర్‌లను రెండోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సోమవారం రెండోరోజూ సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు వెల్లడైనట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న శంకరలక్ష్మి డైరీ నుంచి ఆమె సిస్టమ్ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగిలించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఆమె డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కొట్టేసి గతేడాది అక్టోబరు 1న కంప్యూటర్‌లోని ఎగ్జామ్ పేపర్‌ను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్లు ఏ2 నిందితుడు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌ కుమార్‌ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు డాక్యానాయక్‌, రాజేందర్‌లను పోలీసులు సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సొంతూరికి తీసుకెళ్లారు. వారు అక్కడ ఎవరెవరితో బేరసారాలు మాట్లాడారు, ఎవరెవరికి ప్రశ్నపత్రాలు ఇచ్చారనే అంశంపై ఆరా తీశారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల మేరకు మరికొందరి అనుమానితల ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు సేకరించినట్లు తెలిసింది. అందులో ఆగురుగురిని గుర్తించగా.. మరో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థులను సిట్ అధికారులు గుర్తించారు. వారిలో 60 మందిని విచారించి వివరాలు సేకరించారు. రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉండగా.. అతడిపై సిట్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే హైదరాబాద్ బడంగ్‌పేట్ లోని ప్రవీణ్‌ కుమార్‌ నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. రూ. 5 లక్షల నగదును సీజ్ చేసినట్లు సమాచారం.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.