యాప్నగరం

మంచిర్యాలలో కరోనా అలజడి.. ఒకే రోజు 6 కేసులు

Mancherial: మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలోనూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవు. జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం బాగా తగ్గిందని ఊరట చెందుతున్న నేపథ్యంలో తాజా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

Samayam Telugu 13 May 2020, 8:19 pm
మంచిర్యాల జిల్లాలో ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ గుర్తించడం కలకలం రేపుతోంది. వీరంతా ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలు కావడం గమనార్హం. కరోనా సోకిన వారిలో హజీపూర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు కాగా, దండేపల్లి మండలం నర్సాపూర్‌లో మరో ఇద్దరికి సోకింది. వీరందరినీ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్సుల్లో తరలించారు. దీంతో ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 9 మంది వలస కూలీలు కరోనా బారిన పడ్డట్లయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


Also Read: undefined

అయితే, మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలోనూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవు. జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం బాగా తగ్గిందని ఊరట చెందుతున్న నేపథ్యంలో తాజా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అంతేకాక, ఏప్రిల్‌ 14న చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా వల్ల చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లాకు ముంబయి నుంచి ఇటీవలే 120 మంది వలస కార్మికులు వచ్చారు. వీరి విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.