యాప్నగరం

బోర్‌వెల్‌ను ఢీకొన్న బొలెరో కారు.. ఏడుగురు మృతి

బోర్‌వెల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. దీంతో మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 2 Dec 2020, 10:56 am
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. రక్తసిక్తం అయిన రహదారులు జనాల గుండెల్లో భయాందోళనలకు కలిగిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఓ బోర్‌వెల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తాాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాల్ని బయటకు తీశారు.
Samayam Telugu రోడ్డు ప్రమాదం
road accident


చేవెళ్ల మండలం కందవాడ శివారులోని మూలమలుపు వద్ద ఇవాళ ఉదయం బోర్‌వెల్‌ను ఇన్నోవా బొలెరో కారు ఢీకొట్టింది. హైదరాబాద్‌- బీజాపూర్‌ రహదారిపై ఇన్నోవా కారు బోర్‌వెల్‌ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సహా ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.