యాప్నగరం

వాటర్ ట్యాంక్‌లో రెండు అస్థి పంజరాలు.. పిల్లలవేనని అనుమానం

పతంగులు ఎగురవేస్తూ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చిన పిల్లలకు అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో వెంటనే వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించారు.

Samayam Telugu 17 Jan 2021, 8:18 am
వాటర్ ట్యాంక‌లో అస్థి పంజరాలు కలకలం రేపాయి. రెండు అస్థి పంజరాల్ని చూసిన స్థానికులు అవి పిల్లలవని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. జిల్లా నర్మెటలో వాడుకలో లేని ఓ వాటర్‌ ట్యాంక్‌లో రెండు అస్థి పంజరాలు వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లే దారిలో ఉపాధి హామీ పథకం కింద ఓ వ్యవసాయ కేంద్రంలో నర్సరీ ఉండేది. కొన్నేళ్లుగా దీని నిర్వహణ సరిగా లేకపోవడంతో నర్సరీ కోసం ఏర్పాటుచేసిన వాటర్‌ ట్యాంక్‌ను నిరుపయోగంగా వదిలేశారు.
Samayam Telugu వాటర్ ట్యాంకులో అస్థి పంజరాలు


Read More: గూగుల్ ప్లేస్టోర్‌కు హైదరాబాద్ పోలీసులు లేఖ

అయితే శుక్రవారం కొందరు పిల్లలు పతంగులు ఎగరేసుకుంటూ ట్యాంకు వైపు వెళ్లగా దుర్వాసన రావడంతో వెంటనే స్థానికులకు చెప్పారు. వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌ వెళ్లి అస్థి పంజరాలను పరిశీలించారు. వాటర్‌ ట్యాంక్‌ చాలా ఎత్తులో ఉండటం వల్ల కోతులు ఆడుకుంటూ అందులో పడి చనిపోయి ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇద్దరు చిన్నారులను చంపేసి అందులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.