యాప్నగరం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఐదేళ్ల క్రితం గోపి, రమ్యకృష్ణకు వివాహం జరిగింది.. ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగా.. జీవితం కూడా సంతోషంగా, సాఫీగా సాగిపోతోంది.

Samayam Telugu 3 Oct 2020, 12:27 pm
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలంరేపింది. నార్సింగ్ హైదర్ షాకోట్ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో ఉన్న సామ్రాట్ అపార్ట్‌మెంట్‌లో రమ్యకృష్ణ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లారు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్తతో పాటూ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య


ఐదేళ్ల క్రితం గోపి, రమ్యకృష్ణకు వివాహం జరిగింది.. ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగా.. జీవితం కూడా సంతోషంగా, సాఫీగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో రమ్యకృష్ణ ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భర్త కూడా తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతున్నారు.. తన భార్యతో గొడవలు లేవంటున్నారు. రమ్య ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.