యాప్నగరం

Hyd: ఫోటో వాట్సప్ స్టేటస్‌‌ పెట్టిన తల్లి.. వెంటనే కొడుకు జైలుపాలు

Rachakonda Police: సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకొని లోపలికి వెళ్లగా తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగినట్లు గుర్తించాడు.

Samayam Telugu 31 Oct 2020, 2:46 pm
ఏడాది క్రితం నమోదైన ఓ కేసు వ్యవహారం ఒక్క వాట్సప్ స్టేటస్‌తో తేలిపోయింది. ఓ మహిళ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టగా అది ఆమె కొడుకు అరెస్ట్‌ కావడానికి కారణం కావడం గమనార్హం. 15 నెలల క్రితం నమోదయిన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో పోలీసులకు ఈ వాట్సాప్‌ స్టేటస్‌ ఉపయోగపడింది. ఈ ఘటన హైదరాబాద్‌‌లోనే జరిగింది. నగరంలోని రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతేడాది అంటే 2019 జూలై 12న జ్యూవెలరీ మిస్సింగ్‌కి సంబంధించి ఓ కేసు నమోదైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
arrest


సాయికిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకొని లోపలికి వెళ్లగా తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కేసు విచారణ దశలోనే ఉంది. నిందితులెవరో చిక్కలేదు.

కట్ చేస్తే.. ఇన్ని రోజుల తరువాత అతని ఇంటి పక్కన ఉండే మహిళ వీళ్ల ఇంట్లో పోయిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇది చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో దొంగిలించినదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందరే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఆ నగను అతను దొంగిలించి తల్లికి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు గుర్తించి, ఆమెకు కూడా నోటీసులిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.