యాప్నగరం

తల్లి తిట్టిందని.. పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్న యువకుడు

18 ఏళ్ల కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించిందని చిన్న కారణానికే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Samayam Telugu 11 Oct 2020, 8:46 am
చిన్న చిన్నకారణాలకే ఈ కాలం పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టినా.. అడిగినవి ఏం కొనివ్వకపోయినా.. మనస్తాపంకు గురై బలవన్మరణాలకుపాల్పడుతున్నారు. తాజాగా తల్లి తిట్టిందని ఓ 18 ఏళ్ల కొడుకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగండ్లలో నివాసం ఉండే సంతోష్‌ కుమార్‌(18) లాక్ డౌన్ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే తల్లి చదువుకోవాలని మందలించడంతో తీవ్ర నస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
Samayam Telugu కొడుకు ఆత్మహత్య
son suicide


Read More: ములుగులో మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

సంతోష్ శుక్రవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆచూకీ లభించకపోవడంతో తండ్రి రాధాకృష్ణ చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంతోష్ మొబైల్‌ నెంబర్‌ను ట్రేస్‌చేసి లొకేషన్ కనిపెట్టాడు. అతడు ఉన్న నల్లగండ్లలోని హుడాప్లాట్‌కు వెళ్లారు. అప్పటికే సంతోష్ కుమార్‌ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణ వార్త విని తల్లి గుండెలవిసేలా రోధించిన తీరు అందర్నీ కలిచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.