యాప్నగరం

గంగా పుష్కరాలకు వెళ్తున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్

Special Trains: గంగా పుష్కరాలకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి బెనారస్‌కు నాలుగు ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Apr 2023, 11:06 am

ప్రధానాంశాలు:

  • గంగాపుష్కరాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్
  • సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
  • వెల్లడించిన సౌత్ సెంట్రల్ రైల్వే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ganga Pushkaralu
గంగా పుష్కరాలు
Ganga Pushkaralu 2023: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలు జరుగుతాయన్న విషయం తెలసిందే. ఈ ఏడాది (2023) గంగానదికి పుష్కారాలు జరుగుతున్నాయి. 12 రోజుల పాటు పుష్కరాలు జరగనుండగా.. ఇప్పటికే పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 22 న పుష్కరాలు ప్రారంభం కాగా.. మే 3 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఇప్పటేకి గంగానది తీరాలు పుష్కరశోభను సంతరించుకున్నాయి. గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాల్లో పుష్కర స్నానాలకు ఘాట్లు సిద్ధమయ్యాయి.
అయితే జంటనగరాల (హైదరాబాద్, సికింద్రాబాద్) నుంచి పుష్కరాలకు వెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ - బనారస్ మధ్య నాలుగు స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ ట్రైన్లు.. ఇవాళ (ఏప్రిల్ 29) నుంచి మే 5 మధ్య సేవలందిస్తాయి. ఇవాళ సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.40 గంటలకు ఓ ట్రైన్ బయల్దేరి మే 1 ఉదయం 06.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఉదయం 08.35 గంటలకు బనారస్ నుంచి ట్రైన్ బయల్దేరి సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మే 2న సికింద్రాబాద్ నుంచి రెండో రైలు రాత్రి 9.40 గంటలకు బనారస్ బయలుదేరుతుంది. ఇలా మే 5 వరకు ఈ ట్రైన్లు నిరంతరం ప్రయాణిస్తునే ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ట్రైన్లు జనగాం, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పుర్‌ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటాలియన్, పిపారియా, జబల్‌పూర్, కట్ని జంక్షన్, శాంతా, మణిపూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు చెప్పారు. ఈ అవకాశాని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.