యాప్నగరం

మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు, మంత్రి పదవి!

కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని.. ఆమె బుధవారం నామినేషన్ వేయబోతున్నట్లు ప్రచారం. నామినేషన్ల ప్రక్రియకు గురువారం ఆఖరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ.

Samayam Telugu 18 Mar 2020, 7:42 am
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు దక్కబోతోందా.. ఆమెకు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమైందా.. తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. ఆమెకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని.. ఆమె బుధవారం నామినేషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు గురువారం ఆఖరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా విజయం ఎలాగూ లాంఛనం కావడంతో.. ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu kavitha


రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో కవితకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని రాజకీయ సమీకరణాలతో, అనూహ్యంగా సీనియర్ నేత కేకేకు మరోసారి అవకాశం కల్పించారు. అలాగే మరో సీటు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి దక్కింది. కవితకు రాజ్యసభ సీటు రాకపోవడంతో ఆమెకు కనీసం ఎమ్మెల్సీ పదవైనా ఇస్తారని చర్చ జరుగుతోంది. ఆమెకు పదవి ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు.

కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 తిరిగి అక్కడి నుంచే పోటీచేసి బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కవిత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ సీటు దక్కకపోవడంతో.. కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభకు పంపలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.