యాప్నగరం

షాకింగ్ వీడియో: రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొట్టిన కారు.. వరంగల్‌లో ఘోర ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Samayam Telugu 18 Apr 2020, 3:59 pm
రంగల్ అర్బన్ జిల్లా రాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అల్లంత దూరం ఎగిరిపడ్డ దంపతులు అక్కడికక్కడే మరణించారు. దంపతులను కారుతో ఢీకొట్టిన వ్యక్తి.. ప్రమాదం తర్వాత అంతే వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రమాద దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Samayam Telugu accident


వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన నాయిని ఐలయ్య (65), వెంకటమ్మ (55) దంపతులు శనివారం (ఏప్రిల్ 18) బ్యాంకు పని నిమిత్తం వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలో రాంపూర్ స్టేజీ వద్ద రోడ్డుపై దంపతులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వారిని ఐలయ్య, వెంకటలక్ష్మీగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

దంపతులిద్దరూ రాంపూర్ స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయినట్లు సంఘటనా స్థలాన్ని చూసి కుటుంబసభ్యులు భావించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ చూడకపోవడంతో నిందితుడు పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దంపతులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనాన్ని సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. ఉదయం 10.47 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: 108 అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం.. రోడ్డు పక్కన నిలిపి..

లాక్‌డౌన్ విధించడంతో రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి ఎవరూ రావొద్దన్న నిబంధనలు ఉండటంతో వాహనాలు పెద్దగా రోడ్డు ఎక్కడం లేదు. అయితే.. రోడ్లు నిర్మానుష్యంగా ఉండటంతో కొంత మంది తమ వాహనాలను మితిమీరిన వేగంతో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ తరహాలోనే రోడ్డు దాటుతున్న దంపతులను కారు చిదిమేసింది.

Must Read: మక్కాలో కరోనాతో తెలంగాణ వాసి మృతి.. కడచూపు కరువే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.