యాప్నగరం

గన్‌తో కాల్చుకొని ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

రాత్రి షిప్ట్‌లో ఉన్న మధు ఉదయం సమయంలో తన గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఆత్మహత్యా? లేక గన్ మిస్ ఫైర్ అయ్యిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Samayam Telugu 1 Nov 2020, 11:58 am
సికింద్రాబాద్ రాణిగంజ్ లో ఓ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గోండ జిల్లా బత్తుల పల్లికి చెందిన మధు అనే వ్యక్తి ఎస్పీఎఫ్ కానిస్టేబల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం రాణిగంజ్‌లో బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కార్యలయంలో పని చేస్తున్నారు. రాత్రి షిప్ట్ లో ఉన్న మధు..ఉదయం సమయంలో తన గన్ తో తలకు కాల్చుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు.
Samayam Telugu మధు (ఫైల్ ఫోటో)


Read More: నీ దగ్గర చాయ్ బాగుంటుందంటగా.. దుబ్బాకలో చాయ్ డబ్బా వద్ద టీ తాగిన మంత్రి హరీష్ రావు

అయితే ఆ శబ్ధం విని అందరు అక్కడికి వచ్చే లోపే అతడు ప్రాణలు కోల్పోయాడు. అయితే మధు అత్మహత్య కు గల కారణలు ఇంక తెలియలేదు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న మహాంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గన్ మిస్ ఫైర్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు మహంకాళి పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్న టైంలో గన్ మిస్ ఫైర్ అయినట్లు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.