యాప్నగరం

ఆస్పత్రిలో ఉరేసుకొని వైద్యుడి ఆత్మహత్య.. నలుగురి పేర్లు రాసి..

LB Nagar: డబ్బు విషయంలో వారు నలుగురు మానసిక వ్యథకు గురి చేసినట్లు, జీవితంపై నిరాశతో లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు డాక్టర్ అజయ్ లేఖలో పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వాలని ఈ నలుగురే అజయ్‌ను వేధిస్తున్నట్లుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Samayam Telugu 4 Feb 2020, 12:40 pm
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్‌లో వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ హాస్పిటల్‌లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్బీనగర్ పోలీసులు అజయ్ మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, నలుగురు వ్యక్తులు తనను మానసికంగా వేధించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వైద్యుడు ఓ సూసైడ్ నోట్ రాశారు. ఆ నలుగురి పేర్లను సైతం అందులో పేర్కొన్నారు.
Samayam Telugu LB Nagar Doctor sucide


Also Read: సముద్రంలోనూ కరోనా.. ఓడలో బంధీలుగా 3,500 మంది ప్రయాణికులు

వైష్ణవి ఆస్పత్రి భవన యజమాని కరుణారెడ్డి, అతని బావమరిది కొండల్ రెడ్డి, తుర్కయంజాల్ కాంగ్రెస్ నేత శివకుమార్, సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి పేర్లను డైరీలో పేర్కొన్నాడు.

Must Read: మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు.. 66 కి.మీ. అడవిలో కాలినడకన

డబ్బు విషయంలో వారు నలుగురు మానసిక వ్యథకు గురి చేసినట్లు, జీవితంపై నిరాశతో లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు డాక్టర్ అజయ్ లేఖలో పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వాలని ఈ నలుగురే అజయ్‌ను వేధిస్తున్నట్లుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొండల్ రెడ్డి అనే వ్యక్తి నేరుగా హాస్పిటల్‌కు వచ్చి డబ్బు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, వీరికి అజయ్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘‘కేటీఆర్ తెలంగాణ నయా గజినీ’’ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

Also Read: బాలిక కళ్లలో నుంచి రాళ్లు.. రోజుకు 30 వరకూ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.