యాప్నగరం

కరీంనగర్‌‌లో శ్రీకాకుళం జిల్లా.. ఓ రేంజ్‌లో పేలుతున్న సెటైర్లు

శ్రీకాకుళం జిల్లా పేరును కరీంనగర్ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. క్లరికల్ తప్పిదం కారణంగానే ఇలా జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు.

Samayam Telugu 18 Jul 2020, 1:58 pm
కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంటే.. శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో ఉంటుంది. కానీ కరీంనగర్ ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం శ్రీకాకుళంను కరీంనగర్‌లో కలిపేశారు. అదేంటి అనుకుంటున్నారా..? కరీంనగర్ జిల్లా కరోనా బులెటిన్‌లో ప్రాంతాలు, మండలాల వారీగా వివరాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ అర్బన్‌లో శ్రీకాకుళం జిల్లా పేరు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు అవాక్కయ్యారు. అంతే కాదు సైదాపూర్ మండలంలో లేని ఎరుకలగూడెం పేరును ఆ మండలంలో ఉంచారు.
Samayam Telugu karimnagar to srikakulam


ఈ విషయాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. పొరపాటు కారణంగా ఇలా జరిగిందని సర్దిచెప్పారు. అనంతరం తప్పిదాన్ని సరి చేసి హెల్త్ బులెటిన్‌ను ట్విట్టర్‌లో ఉంచారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ట్విట్టర్లో సెటైర్లు వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎక్కడా అని సరదాగా ప్రశ్నిస్తున్నారు.

హెల్త్ బులెటిన్లలో తప్పుడు దొర్లడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన కరోనా బులెటిన్‌లో మిర్యాలగూడను జిల్లాగా పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మరో కొత్త జిల్లా వచ్చి చేరిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.