యాప్నగరం

శ్రీశైలం అగ్నిప్రమాదం.. సీఐడీ విచారణలో వెలుగులోకి కీలక అంశాలు

అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించే ప్లాంట్‌లో ఫైర్ సేఫ్టీ ఎందుకు లేదు? ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎందుకు పాటించలేదు? అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీఐడీ పేర్కొంది.

Samayam Telugu 26 Aug 2020, 2:31 pm
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీఐడీ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సీఐడీ అధికారులు పలు మార్పులు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పలు సెక్షన్‌లను అదనంగా చేర్చారు. కేసును ప్రభావితం చేసే కీలక అంశాలను సీఐడీ గుర్తించింది. ప్రమాదంపై సిబ్బంది నిర్లక్ష్యం నిర్వహణ, లోపాలపై దృష్టి సారించింది. ఫైర్ సెఫ్టీ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపింది. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రతను పెంచిందని సీఐడీ గుర్తించింది.
Samayam Telugu శ్రీశైలంలో అగ్నిప్రమాదం
srisailam fire accident


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌లో ఎందుకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్న దానిపై విచారణ చేపట్టింది. 240 మేగవాట్ల ట్రాన్స్ఫార్మర్స్ బ్లాస్ట్ అయిన నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి సరైన పరికరాలు చేపట్టలేదని గుర్తించింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడంపై ప్రమాద తీవ్రతను పెంచిందని సీఐడీ పేర్కొంది. యాజమాన్యం సరి పడినంత రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం తీవ్రత పెరిగిందని భావిస్తోంది. ఈ వారంలో మరోసారి ఘటన స్థలానికి సీఐడీ వెళ్లనుంది. కేసును తీవ్రత చేసే కీలక అంశాలపై సీఐడీ టీం దృష్టి పెట్టింది.
Read More: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి.. పోలీస్ శాఖలో విషాదం
గత గురువారం శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్లాంట్‌లో పనిచేస్తున్న దాదాపు తొమ్మిది మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించింది. దీంతో పాటు ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.