యాప్నగరం

కోలుకున్న కరోనా రోగి: కేంద్రం, రాష్ట్రం భిన్న ప్రకటనలు.. ఏది నిజం?

Coronavirus in Hyderabad: గాంధీలో చికిత్స పొందుతున్న కరోనావైరస్ బాధితుడు కోలుకున్నాడని.. అతడికి వ్యాధి పూర్తిగా నయమయిందని గురువారం మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. త్వరలోనే అతడిని డిశ్చార్చి చేస్తామని తెలిపారు.

Samayam Telugu 14 Mar 2020, 7:07 pm
తెలంగాణలో కరోనా పాజిటివ్‌గా నమోదైన తొలి కేసులో ఓ యువకుడు కోలుకున్నాడని, అతణ్ని డిశ్చార్జి చేస్తున్నామని శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌కు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కరోనా వ్యాధితో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. గత మార్చి 1 నుంచి అతడికి ఇక్కడి ఐసోలేషన్ వార్డులో చికిత్స జరుగుతోంది. అయితే, ఇప్పుడు ఇతని ఆరోగ్య స్థితిపై కొంత గందరగోళం నెలకొంది. ఈ కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుకున్నాడని, డిశ్చార్జి చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేయగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోలుకున్నవారి జాబితాలో ఇతని ప్రస్తావనే లేదు.
Samayam Telugu coronavirus hyderabad was tested positive


Must Read: కరోనా వల్ల చనిపోతే భారీ ఎక్స్‌గ్రేషియా.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో నమోదైన కరోనా కేసుల గురించి శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో ఉంచింది. శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులు 81 నమోదయ్యాయని, వారిలో కర్ణాటక వ్యక్తి సహా మరో మహిళ చనిపోయారని వెల్లడించింది. ఇప్పటికే కేరళలో ముగ్గురు వ్యక్తులు కోలుకోవడంతో.. వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. తాజాగా సఫ్దార్‌జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు వ్యక్తులు కోలుకున్నారని స్పష్టంగా పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ వ్యక్తి కోలుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.


Also Read: కరెంటుతో పాటు ఆ ఛార్జీలూ పెంపు.. తేడా వస్తే 25 రెట్లు ఫైన్! కేసీఆర్ ప్రకటన

కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెబ్‌సైట్లో పొందుపరిచిన జాబితాలోనూ తెలంగాణ వ్యక్తి కోలుకున్నట్లు ప్రస్తావించలేదు. తెలంగాణలో ఒక కేసు నమోదైందని మాత్రమే పేర్కొన్నారు. తెలంగాణలో కోలుకున్న రోగుల సంఖ్యని సున్నాగా చూపించారు. దిల్లీ ఒకరు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్‌లో ఒకరు, యూపీలో ఐదుగురు కోలుకున్నట్లు మాత్రం స్పష్టంగా ప్రకటించారు.

అయితే, గాంధీ ఆస్పత్రి పేషెంట్ విషయంలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది. గాంధీలోని పేషెంట్ నిజంగా కోలుకొని ఉంటే కేంద్రం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్న ఉదయిస్తోంది. లేదా రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారుల మధ్య సమన్వయ లోపమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు.. పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.